బుగ్గనతో భారత హై కమిషనర్ సర్ జావేద్ అష్రాఫ్ భేటీ
సింగపూర్: 'ఇండియా సింగపూర్- ది నెక్ట్స్ ఫేజ్ సదస్సు'కు హాజరైన ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్తో సింగపూర్లోని భారత హైకమిషనర్ సర్ జావేద్ అష్రాఫ్తో సమావేశమయ్యారు. సదస్సులో ఆంధ్రప్రదేశ్ పోషిస్తున్న కీలక పాత్రను, నాలుగు అంశాలను పునాదులుగా చేసుకొని రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ప్రణాళికలు అమలుపై బుగ్గన రాజేంద్రనాథ్ ఈ సందర్భంగా ఆయనకు వివరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి అడిషనల్ చీఫ్ సెక్రటరీ డా. పీవీ రమేష్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి షంషేర్ సింగ్ రావత్ పాల్గొన్నారు.