నీటితొట్టిలో పడి బాలుడి మృతి | Sakshi
Sakshi News home page

నీటితొట్టిలో పడి బాలుడి మృతి

Published Fri, Feb 13 2015 6:15 PM

boy felt in a water tub and died

చిత్తూరు: ఓ నాలుగేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు నీటి తొట్టిలో పడి మృతి చెందాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం సెల్లిగాని పల్లె గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు... గ్రామానికి చెందిన భారతమ్మ, చంద్రప్పల చిన్న కుమారుడు మహేంద్ర(4). తల్లిదండ్రులు పొలం పనులకు వెళుతూ కుటుంబ సభ్యుల వద్ద మహేంద్రను ఉంచారు. అతడు తోటి పిల్లలతో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీటితొట్టిలో పడి మృతి చెందాడు.

(శాంతిపురం)

Advertisement

తప్పక చదవండి

Advertisement