తల్లిదండ్రులతో పొలం దగ్గరకు వెళ్లిన బాలుడు మోటర్ వేయబోయి విద్యుద్ఘాతానికి గురయ్యాడు.
గోనెగండ్ల (కర్నూలు జిల్లా) : తల్లిదండ్రులతో పొలం దగ్గరకు వెళ్లిన బాలుడు మోటర్ వేయబోయి విద్యుద్ఘాతానికి గురయ్యాడు. ఈ సంఘటన ఆదివారం కర్నూలు జిల్లా గోనెగండ్ల కేంద్రంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన కొండరాజు, మణెమ్మ దంపతుల కుమారుడు శేఖర్(15) తల్లిదండ్రులతో కలిసి పొలం దగ్గరకు వెళ్లాడు. ఈ క్రమంలో మోటర్ వేసేందుకు ప్రయత్నిస్తుండగా ఎర్త్ వైరు తగిలి విద్యుద్ఘాతానికి గురయ్యాడు. కళ్ల ముందే కొడుకు చనిపోవడంతో ఆ దంపతులు శోకసంద్రంలో మునిగిపోయారు.