విద్యుద్ఘాతానికి బాలుడి మృతి | Boy dies due to electrocution | Sakshi
Sakshi News home page

విద్యుద్ఘాతానికి బాలుడి మృతి

May 17 2015 12:05 PM | Updated on Jul 12 2019 3:02 PM

తల్లిదండ్రులతో పొలం దగ్గరకు వెళ్లిన బాలుడు మోటర్ వేయబోయి విద్యుద్ఘాతానికి గురయ్యాడు.

గోనెగండ్ల (కర్నూలు జిల్లా) : తల్లిదండ్రులతో పొలం దగ్గరకు వెళ్లిన బాలుడు మోటర్ వేయబోయి విద్యుద్ఘాతానికి  గురయ్యాడు. ఈ సంఘటన ఆదివారం కర్నూలు జిల్లా గోనెగండ్ల కేంద్రంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే..  గ్రామానికి చెందిన కొండరాజు, మణెమ్మ దంపతుల కుమారుడు శేఖర్(15)  తల్లిదండ్రులతో కలిసి పొలం దగ్గరకు వెళ్లాడు. ఈ క్రమంలో మోటర్ వేసేందుకు ప్రయత్నిస్తుండగా ఎర్త్ వైరు తగిలి విద్యుద్ఘాతానికి గురయ్యాడు. కళ్ల ముందే కొడుకు చనిపోవడంతో ఆ దంపతులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement