పంటపొలాల్లో మృతదేహం | Sakshi
Sakshi News home page

పంటపొలాల్లో మృతదేహం

Published Mon, Nov 30 2015 2:09 PM

Body found on farms

పంటపొలల్లో గుర్తుతెలియని మృతదేహం కలకలం రేపింది. కృష్ణా జిల్లా కంచికచర్ల మండల శివారు పంట పొలల్లో ఈ రోజు పని చేసుకోవడానికి వెళ్లిన రైతులుకు మృతదేహం కనిపించింది.  దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలియరాలేదు. మృతుడు ఎవరు? సమీప గ్రామాలకు చెందిన వ్యక్తా..? లేక ఎక్కడైనా హత్యచేసి.. మృత దేహాన్ని ఇక్కడ పడేశారా..? అన్నకోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


 

Advertisement
Advertisement