‘అ‍క్రమ కట్టడాలు కూల్చితే మాకేం అభ్యంతరం లేదు’ | BJP Kanna Lakshmi Narayana About Jagan and KCR Meeting | Sakshi
Sakshi News home page

ఇరు రాష్ట్రాల సీఎంల చర్యలను స్వాగతిస్తున్నాం : కన్నా

Jun 28 2019 2:20 PM | Updated on Jun 28 2019 2:23 PM

BJP Kanna Lakshmi Narayana About Jagan and KCR Meeting - Sakshi

సాక్షి, అమరావతి : అక్రమ కట్టడాలన్నింటి కూల్చేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. శుక్రవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల చర్చలను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. గోదావరి జలాలను సద్వినియోగం చేసుకోవాలన్న ఆలోచన మంచిదే అన్నారు. కరువు ప్రాంతాల సాగు, తాగు నీటి కష్టాలు తీర్చే దిశగా చర్చలు జరగాలని కోరుకున్నారు. కేసులున్నవారే బీజేపీలో చేరుతున్నారనడం సరి కాదన్నారు. నిందితుల విషయంలో చట్టం తన పని చేసుకుపోతుందని తెలిపారు. పార్టీ ఫిరాయింపులుపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయంపై తానేమి స్పందించనన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement