సీఎం జగన్‌ను కలిసిన ఏయూ విద్యార్థులు | AU Students Met AP CM YS Jagan In Delhi Airport | Sakshi
Sakshi News home page

సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన ఏయూ విద్యార్థులు

Jun 19 2019 8:55 PM | Updated on Jun 19 2019 9:02 PM

AU Students Met AP CM YS Jagan In Delhi Airport - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఢిల్లీ విమానాశ్రయంలో ఏయూ విద్యార్థులు కలిశారు. గత ప్రభుత్వం తమపై నమోదు చేసిన అక్రమ కేసులు ఎత్తివేయాలని వారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఇందుకు సంబంధించి త్వరలో జీవో జారీ చేసి, కేసులు మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి వారికి హామీ ఇచ్చారు. కాగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత జరిగిన అఖిలపక్ష సమావేశంలో వైఎస్‌ జగన్‌ పాల్గొన్నారు. ఒకే దేశం ఒకేసారి ఎన్నికల అంశంపై జరిగిన ఈ చర్చలో 21 రాజకీయ పార్టీల అధ్యక్షులు పాల్గొన్నారు. అంతకు ముందు వైఎస్‌ జగన్‌ ఢిల్లీ విమానాశ్రయం నుంచి పార్లమెంట్‌ వరకూ మెట్రో రైలులో ప్రయాణం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement