విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న భార్యపై భర్త హత్యాయత్నానికి పూనుకున్నాడు.
కృష్ణా: విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న భార్యపై భర్త హత్యాయత్నానికి పూనుకున్నాడు. గొంతు నులిమి చంపడానికి ప్రయత్నించగా భార్య కొమ్ము రాణి (22) కేకలు వేయడంతో భర్త రమేశ్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఐదు రోజుల క్రితం భర్త వేధింపులు తాళలేక ,భార్య కిరోసిన్ పోసి నిప్పంటించుకుంది. తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానికులు విజయవాడ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియరాలేదు.
(విజయవాడ)