దిల్సుఖ్నగర్లో పేలిన బాంబులు గోవాలో తయారయినవా? | are Made the Dilsukhnagar bombs in Goa? | Sakshi
Sakshi News home page

దిల్సుఖ్నగర్లో పేలిన బాంబులు గోవాలో తయారయినవా?

Sep 18 2013 9:20 PM | Updated on Sep 28 2018 4:46 PM

దిల్సుఖ్నగర్లో పేలిన బాంబులు గోవాలో తయారయినవా? - Sakshi

దిల్సుఖ్నగర్లో పేలిన బాంబులు గోవాలో తయారయినవా?

దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్లకు వాడిన బాంబులను గోవాలో తయారు చేసినట్లు తెలుస్తోంది.

హైదరాబాద్:  దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్లకు వాడిన బాంబులను  గోవాలో తయారు చేసినట్లు తెలుస్తోంది. ఎన్‌ఐఏ సోదాల్లో గోవాలో బాంబుతయారీ ల్యాబ్‌ ఒకటి బయటపడింది.  బాంబుతయారీ పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్టుగా గోవా సీఎం పారిక్కర్‌ వెల్లడించారు.
ఆ ల్యాబ్ దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్లకు బాధ్యుడైన  యాసిన్‌ భత్కల్‌కు చెందినదిగా అనుమానిస్తున్నారు.

 దిల్‌సుఖ్‌నగర్‌ జంట బాంబు పేలుళ్లకు తానే వ్యూహం పన్నినట్లు నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహుద్దీన్ అగ్రనేత యాసిన్ భత్కల్ అంగీకరించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లో గత ఫిబ్రవరిలో జరిగిన బాంబు పేలుళ్లతో పాటు దేశవ్యాప్తంగా సుమారు 40 బాంబు పేలుళ్ల కేసులో  యాసిన్ భత్కల్  నిందితుడు. వరుస దాడులకు దిగుతూ ప్రభుత్వానికి కంటి మీద కునుకులేకుండా చేసిన భత్కల్ను ఇటీవల  భారత్ -నేపాల్ సరిహద్దులో అరెస్ట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement