'సెల్‌ఫోన్‌ వెలుగులో ఆపరేషన్ వాస్తవమే’ | AP Minister Kamineni Srinivasa Rao Visits GGH in Guntur  | Sakshi
Sakshi News home page

జీజీహెచ్‌లో మంత్రి కామినేని తనిఖీలు

Feb 16 2018 11:42 AM | Updated on Aug 24 2018 2:33 PM

 AP Minister Kamineni Srinivasa Rao Visits GGH in Guntur  - Sakshi

ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ శుక్రవారం గుంటూరు జీజీహెచ్‌ని సందర్శించారు.

సాక్షి, గుంటూరు : ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ శుక్రవారం గుంటూరు జీజీహెచ్‌ని సందర్శించారు. ఓ పేషెంట్‌కు సెల్ ఫోన్ వెలుగులో ఆపరేషన్ నిర్వహించిన విషయం వెలుగులోకి వచ్చిన తెలిసిందే. ఈ నేపథ్యంలో కామినేని జీజీహెచ్‌లో తనిఖీలు చేపట్టారు. ఆపరేషన్‌ నిర్వహించిన థియేటర్‌ను పరిశీలించి డాక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కామినేని మాట్లాడుతూ 'సెల్‌ఫోన్‌ వెలుగులో ఆపరేషన్ జరగడం వాస్తవమే. ఆపరేషన్‌ నిర్వహించిన రోజు నాలుగుసార్లు కరెంటు పోవడంతో అంతరాయం ఏర్పడింది. దీంతో డాక్టర్లు సెల్‌ఫోన్‌ వెలుగులో శస్త్రచికిత్స పూర్తి చేశారు. ఈ సంఘటనపై డీఎంఈను విచారణ అధికారిగా నియమించాం. ఆపరేషన్‌ థియేటర్లను రూ. 30 లక్షలతో ఆధునీకరించాం. అన్నీ థియేటర్లు బాగున్నాయి. డీఎంఈ నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం'  అని  తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement