ఎంసెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల | AP higher education council Release EAMCET counselling notification | Sakshi
Sakshi News home page

ఎంసెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల

Jul 30 2014 6:38 PM | Updated on Apr 7 2019 3:35 PM

ఎంసెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల - Sakshi

ఎంసెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల

గత మూడు నెలలుగా కౌన్సెలింగ్ కోసం ఎదురుచూస్తున్న ఎంసెట్ విద్యార్థులకు ఊరట కలిగింది.

హైదరాబాద్: గత మూడు నెలలుగా కౌన్సెలింగ్ కోసం ఎదురుచూస్తున్న ఎంసెట్ విద్యార్థులకు ఊరట కలిగింది. ఉన్నత విద్యామండలి బుధవారం ఎంసెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆగస్టు 7 నుంచి 23 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టనున్నట్టు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

మొదటి రోజు 1 నుంచి 5 వేల ర్యాంక్‌ వరకు ధ్రువపత్రాలను పరిశీలిస్తారు. కౌన్సెలింగ్ కోసం ఆంధ్రప్రదేశ్ లో 34, తెలంగాణలో 23 సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. 2,15,336 మంది విద్యార్థులు ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ కు హాజరుకానున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement