గృహహింస: మహిళలకు అండగా ఏపీ ప్రభుత్వం

AP Government Started One Stop Center For Domestic Violence Victims Women - Sakshi

సాక్షి: విజయవాడ: లాక్‌డౌన్ సమయంలో గృహహింసను ఎదుర్కొంటున్న మహిళలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా నిలిచింది. మహిళల రక్షణకు అన్ని జిల్లాల్లో వన్‌ స్టాప్‌ సెంటర్లను మంగళవారం ప్రారంభించింది.‌ 13 జిల్లాలోని ఈ సెంటర్లు 24 గంటలు పనిచేస్తాయి. ఈ సెంటర్ల నుంచే బాధితులకు  ఆరోగ్య, వైద్య, మానసిక, సాంఘిక, న్యాయ నిపుణుల నుంచి సహాయక చర్యలు అందుతాయని అధికారులు వెల్లడించారు. ఇందుకోసం రాష్ట్రంలో 23 స్వధార్ గృహాల్లో బాధిత మహిళలకు పోలీస్ సంరక్షణ, వసతి సౌకర్యం కల్పించింది. అంతేగాక బాధిత మహిళలకు రౌండ్‌ ది క్లాక్‌ ఉమెన్‌ హెల్స్‌ లైన్‌ 181 అందుబాటులో ఉంటుంది.
(చదవండి: కరోనా: వలంటీర్లకు రూ.50 లక్షల బీమా!)

జిల్లాల్లో తక్షణ సహాయం కోసం కాల్ చేయాల్సిన నెంబర్లు

           జిల్లా పేరు                     ఫోన్‌ నెంబరు
శ్రీకాకుళం 9110793708
విశాఖపట్టణం 6281641040
పశ్చిమ గోదావరి 9701811846 
గంటూరు 9963190234
పొట్టిశ్రీరాములు నెల్లూరు 9848653821
కర్నూలు 9701052497
అనంతపురం 8008053408
విజయనగరం 8501914624 
తూర్పుగోదావరి 9603231497
కృష్ణ 9100079676
ప్రకాశం 9490333797
చిత్తూరు 9959776697
వై.యస్.ఆర్ . కడప 8897723899
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top