'ఏపీ డెయిరీని మూయించే పనిలో చంద్రబాబు' | ap cm try to close ap dairy says Y. Visweswara Reddy | Sakshi
Sakshi News home page

'ఏపీ డెయిరీని మూయించే పనిలో చంద్రబాబు'

Jul 4 2016 5:19 PM | Updated on Aug 18 2018 6:18 PM

హెరిటేజ్ ప్రయోజనాల కోసం ఏపీ డెయిరీని మూయించే పనిలో సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నారని ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు.

హైదరాబాద్: హెరిటేజ్ ప్రయోజనాల కోసం ఏపీ డెయిరీని మూయించే పనిలో సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నారని ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి  మండిపడ్డారు. ఏపీలో పాడి పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో ఉందన్నారు.  వెంటనే ఏపీ డెయిరీకి రూ.100 కోట్లు కేటాయించాలని విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు.

ఒకే నెలలో మూడు సార్లు పాల సేకరణ ధర తగ్గించడం దారుణమన్నారు. పాడి పరిశ్రమను ఆదుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. రైతు వ్యతిరేక ప్రభుత్వంగా పని చేయొద్దని 
విశ్వేశ్వరరెడ్డి సూచించారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement