కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల నిరసనలు
ఉద్యమంలో ముందున్న మహిళా కార్మికులు
కార్మిక శాఖ కార్యాలయాల ముట్టడి
సంఘీభావం తెలిపిన కొత్తపల్లి సుబ్బారాయుడు
నేడు వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ధర్నాలకు పిలుపు
ఏలూరు (ఆర్ఆర్ పేట) :వేతన సవరణ, ఫిట్మెంట్, ఇతర డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె మంగళవారం ఏడవ రోజుకు చేరింది. కార్మికులంతా పట్టుదలతో వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మహిళా కార్మికులు సైతం రెట్టించిన ఉత్సాహంతో ఉద్యమంలో పాల్గొంటున్నారు. ఏలూ రులో నిరాహార దీక్షలు చేస్తున్న కార్మికులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు, పార్టీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, గోపాలపురం నియోజకవర్గ కన్వీనర్ తలారి వెంకట్రావు తదితరులు కలిసి సంఘీభావం తెలిపారు. కార్మిక లోకానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఆర్టీసీ కార్మికుల ఉద్యమానికి మద్దతుగా బుధవారం జిల్లాలోని అన్ని ఆర్టీసీ డిపోల వద్ద అఖిలపక్షంతో కలసి వైఎస్సార్ సీపీ శ్రేణులు ధర్నాలు నిర్వహిస్తాయని చెప్పారు. మంగళవారం ఉదయం కార్మికులు ఏలూరు ఫైర్స్టేషన్ సెంటర్ వరకూ అర్ధనగ్న ప్రదర్శన జరిపి, మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఒక కార్మికుడు శీర్షాసనం వేసి వినూత్నంగా నిరసన తెలిపాడు. జంగారెడ్డిగూడెంలో ఆర్టీసీ ఎండీ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. అనంతరం వంటావార్పు నిర్వహించారు.
తణుకులో అఖిలపక్షం ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. ఎమ్మెల్సీ రాము సూర్యారావు కార్మికులను కలుసుకుని సంఘీభావం తెలిపారు. భీమవరంలో మహిళా కార్మికులు రిలే దీక్షలో పాల్గొన్నారు. కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయానికి ర్యాలీగా వెళ్ళి ధర్నా నిర్వహించారు. నరసాపురంలోనూ కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. కొవ్వూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అరగంట పాటు ధర్నా నిర్వహించి డిపోనుండి బస్సులను బయటకు రానీయకుండా అడ్డగించారు. వైసీపీ సమన్వయకర్త తానేటి వనిత, నాయకులు పరిమి హరిచరణ్, ముదునూరి నాగరాజు, ఎస్సీ సెల్ కార్యదర్శి ముప్పిడి విజయరావు పాల్గొన్నారు.
ఉద్యమాన్ని కొనసాగిస్తాం
భీమవరం : విధులకు హాజరు కావాలంటూ హైకోర్టు ఆదేశించినా ఉద్యమాన్ని నిలిపివేసేది లేదని ఆర్టీసీ ఈయూ రాష్ట్ర కార్యదర్శి ఎస్ఎస్ రావు, ప్రాంతీయ కార్యదర్శి అల్లం సత్యనారాయణలు పేర్కొన్నారు. మంగళవారం రాత్రి విలేకర్లతో మాట్లాడుతూ ప్రభుత్వం దిగివచ్చే వరకు శాంతియుత పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు.
పట్టు‘దళం’గా..
Published Wed, May 13 2015 2:24 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement