విజయవాడ బయల్దేరిన చంద్రబాబు | andhra pradesh cm chandrababu naidu went vijayawada | Sakshi
Sakshi News home page

విజయవాడ బయల్దేరిన చంద్రబాబు

Oct 2 2014 10:06 AM | Updated on Sep 2 2017 2:17 PM

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం విజయవాడ బయల్దేరి వెళ్లారు. ఆయన ఈరోజు ఉదయం 9.15 గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి బయలుదేరారు.

హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం విజయవాడ బయల్దేరి వెళ్లారు.  ఆయన ఈరోజు ఉదయం 9.15 గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి బయలుదేరారు. ఉదయం 9.55 గంటలకు చంద్రబాబు  గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు.

అనంతరం విజయవాడలోని ప్రకాష్‌నగర్‌లో ఏర్పాటు చేసిన 'స్వచ్ఛ భారత్' కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత 10.45 గంటలకు స్వచ్ఛ భారత్ ర్యాలీని ప్రారంభిస్తారు. అనంతరం అక్కడే జన్మభూమి కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. ఆ తర్వాత 10.55 గంటలకు 'నీరు-చెట్టు' కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. చంద్రబాబు నాయుడుతో పాటు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఆయా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement