భూమిపూజకు బంగారు పూత తాపీ, వెండి గమేళా | Andhra pradesh capital bhumipoojaku ' Navaratnas ' | Sakshi
Sakshi News home page

భూమిపూజకు బంగారు పూత తాపీ, వెండి గమేళా

Jun 5 2015 8:20 AM | Updated on Oct 20 2018 4:52 PM

రాజధాని భూమి పూజకు అతి ముఖ్యమైన సామగ్రి తెనాలి నుంచి సమకూరనుంది.

తెనాలి: ఆంధ్రప్రదేశ్ రాజధాని భూమి పూజకు అతి ముఖ్యమైన సామగ్రి తెనాలి నుంచి సమకూరనుంది. బంగారు, వెండి నాణేలు, నవరత్నాలుగా పిలుచుకునే వైఢూర్యం, పుష్యరాగం, పచ్చ, నీలం, కెంపు, వజ్రం, గోమేధికం, పగడం, ముత్యంను తుళ్లూరు తహశీల్దారు సుధీర్ బాబు తెనాలి నుంచి కొనుగోలు చేశారు. అలాగే భూమిపూజకు అవసరమైన గమేళా, తాపీని అంగలకుదురుకు చెందిన వెంకట్రామయ్య వెండితో తయారు చేయించటం విశేషం. కిలో వెండితో వెండి గమేళా, తాపీ చేయించి, తాపీకి బంగారుపూత పూయించారు.

Advertisement
 
Advertisement
Advertisement