నెల్లూరు జడ్పీ కో ఆప్షన్ సభ్యుడిగా అక్బర్ బాషా ఎన్నిక | Akbar basha elected Nellore zilla parishad co-opted member | Sakshi
Sakshi News home page

నెల్లూరు జడ్పీ కో ఆప్షన్ సభ్యుడిగా అక్బర్ బాషా ఎన్నిక

Jul 20 2014 1:32 PM | Updated on Oct 20 2018 6:17 PM

నెల్లూరు జిల్లా పరిషత్ కో ఆప్షన్ సభ్యుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అక్బర్ బాషా ఎన్నికయ్యారు.

నెల్లూరు : నెల్లూరు జిల్లా పరిషత్ కో ఆప్షన్ సభ్యుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అక్బర్ బాషా ఎన్నికయ్యారు. జడ్పీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ తరఫున కో ఆప్షన్ సభ్యులుగా బరిలో దిగిన వారికి సమానంగా ఓట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో అధికారులు లాటరీ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేశారు.

అందులో భాగంగా వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి అక్భర్ బాషాను విజయం వరించింది. నెల్లూరు జిల్లాలో మొత్తం 46 జడ్పీటీసీలు ఉన్నాయి. వైఎస్ఆర్ సిపి నుంచి 8 మంది సభ్యులు టిడిపికి మద్దతు పలకడంతో ఇరు పక్షాల బలం సమానమైంది.  దాంతో అధికారులు లాటరీ ద్వారా కో ఆప్షన్ సభ్యులను ఎంపిక చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement