తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వచ్చిన నేపథ్యంలో వివిధ రాజకీయపార్టీలు నేడు పలు వాయిదా తీర్మానాలు చేశాయి.
తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వచ్చిన నేపథ్యంలో వివిధ రాజకీయపార్టీలు నేడు పలు వాయిదా తీర్మానాలు చేశాయి. సమైక్య రాష్ట్రంపై తీర్మానం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం ప్రవేశ పెట్టింది. అలాగే తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరిపై సభలో చర్చించాలని తెలుగుదేశం పార్టీ ఈ వాయిదా చేసింది. వీటిపాటు తెలంగాణ బిల్లుపై చర్చ పెట్టాలని సీపీఐ వాయిదా తీర్మానం ఇచ్చింది. అయితే ప్రతిపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ నాదెండ్ల మనోహర్ తిరస్కరించారు.