ఆర్టీసీ కార్మికులపై అదనపు వడ్డీ భారం | Additional interest burden on RTC workers | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ కార్మికులపై అదనపు వడ్డీ భారం

Apr 12 2016 1:43 AM | Updated on Nov 9 2018 5:56 PM

ఆర్టీసీ కార్మికులపై అదనపు వడ్డీ భారం - Sakshi

ఆర్టీసీ కార్మికులపై అదనపు వడ్డీ భారం

ఆర్టీసీ కార్మికులు క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ(సీసీఎస్) ద్వారా తీసుకున్న రుణాలపై ఒక శాతం అదనపు వడ్డీ వసూలు చేయాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది.

1 శాతం అదనపు వడ్డీ వసూలుకు సర్క్యులర్ 289 జారీ

 కదిరి: ఆర్టీసీ కార్మికులు క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ(సీసీఎస్) ద్వారా తీసుకున్న రుణాలపై ఒక శాతం అదనపు వడ్డీ వసూలు చేయాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు గతనెల 23న సర్క్యులర్ నంబర్ 289ను విడుదల చేసింది. ఇప్పటిదాకా ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు సీసీఎస్ ద్వారా పొదుపు చేసుకున్న మొత్తానికి పది శాతం వడ్డీ ఇచ్చేవారు.

అదేవిధంగా సీసీఎస్ ద్వారా పొందిన స్వల్పకాలిక, విద్యా, గృహ రుణాలపై 11 శాతం వడ్డీ వసూలు చేసేవారు. తాజా సర్క్యులర్ మేరకు ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి 1 శాతం  అంటే ఇకపై 12 శాతం వడ్డీ వసూలు చేయనున్నారు.  సుమారు రూ.32 లక్షలకుపైగా అదనపు భారం కార్మికులపై పడనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement