సజీవదహనం కేసు నిందితుడి అరెస్ట్ | accused of burnt alive case in tenali arrested | Sakshi
Sakshi News home page

సజీవదహనం కేసు నిందితుడి అరెస్ట్

Mar 23 2015 5:29 PM | Updated on Oct 4 2018 8:29 PM

సజీవదహనం కేసు నిందితుడి అరెస్ట్ - Sakshi

సజీవదహనం కేసు నిందితుడి అరెస్ట్

తనతో సహజీవనం చేస్తున్న మహిళను, ఆమె ఏడాదిన్నర వయసున్న కుమారుడిని హత్య చేసి ఇంటికి నిప్పు పెట్టి పారిపోయిన నిందితుడిని పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు.

తెనాలి : తనతో సహజీవనం చేస్తున్న మహిళను, ఆమె ఏడాదిన్నర వయసున్న కుమారుడిని హత్య చేసి ఇంటికి నిప్పు పెట్టి పారిపోయిన నిందితుడిని పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా తెనాలిలో సంచలనం సృష్టించిన ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను, నిందితుడు హత్యకు పాల్పడిన వైనాన్ని సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ సీహెచ్ సౌజన్య వివరించారు.

తెనాలి మండలం నందివెలుగు గ్రామానికి చెందిన గండికోట మణికంఠకు ఏడేళ్ల క్రితం వివాహమైంది. గతంలో గ్రామంలోని ఓ మహిళ మెడలోని గొలుసు చోరీ చేసేందుకు ప్రయత్నించి, ఆమె ప్రతిఘటించడంతో హత్య చేయబోయిన కేసులో మణికంఠ నిందితుడిగా ఉన్నాడు. భర్త ప్రవర్తన నచ్చని భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో కాకుమాను మండలం లింగాయపాలెంలో బేలుదారుపనికి వెళ్తున్న మణికంఠకు, అక్కడ పనిచేసే దేవనపల్లి లక్ష్మి అనే వివాహితతో చనువు ఏర్పడింది.

ఈ నెల మొదటి వారంలో ఆమెను, ఆమె ఏడాదిన్నర వయసున్న కుమారుడు కాశీని నందివెలుగులోని తన ఇంటికి తీసుకువచ్చి వాళ్లతో కలసి ఉంటున్నాడు. కాగా ఈ నెల 12వ తేదీ రాత్రి ఇరువురికి ఘర్షణ జరుగగా, అప్పటికే మద్యం సేవించి ఉన్న మణికంఠ.. లక్ష్మిపై , ఆమె కుమారుడిపై కిరోసిన్‌పోసి నిప్పటించాడు. అంతటితో ఆగకుండా ఇంటికి నిప్పు పెట్టి పరారయ్యాడు. ఈ ఘటనలో లక్ష్మి, ఆమె కుమారు అక్కడే సజీవదహనమయ్యారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు..  సోమవారం నిందితుడు తెనాలి రైల్వే స్టేషన్ వద్ద ఉన్నాడన్న సమాచారం అందడంతో హుటాహుటిన అక్కడకు చేరుకుని అతన్ని అరెస్ట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement