* కేసీఆర్కు మంత్రులు అచ్చెన్న, దేవినేని హెచ్చరిక
* రేవంత్రెడ్డి వ్యవహారంతో తమకు సంబంధం లేదని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు తెలంగాణ ఏసీబీ అధికారులు నోటీసులు జారీచేస్తే తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావు అక్రమాలను రోజుకొకటి చొప్పున బహిర్గతం చేస్తామని మంత్రులు కె.అచ్చెన్నాయుడు, దేవినేని ఉమామహేశ్వరరావు హెచ్చరించారు.
రేవంత్రెడ్డి వ్యవహారంతో తమకు సంబంధం లేదని, చంద్రబాబును దెబ్బతీసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒకడుగు ముందుకేస్తే తాము వందడుగులు ముందుకేస్తామని పేర్కొన్నారు. రాజకీయపార్టీలన్నీ కలసి టీడీపీని, చంద్రబాబును దెబ్బతీసి.. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్రపన్నాయని ఆరోపించారు. బుధవారం సచివాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు. అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. తెలంగాణలో సీఎం కేసీఆర్ను వ్యతిరేకించే వారందరి ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు. ‘‘తెలంగాణలో టీడీపీని భూస్థాపితం చేసేందుకు చంద్రబాబుతోపాటు టీడీపీ మంత్రులు, ప్రజాప్రతినిధుల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారు.
అలాగే తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన కోదండరాం, ఉస్మానియా వర్సిటీ విద్యార్థి నేతలు, విపక్ష కాంగ్రెస్ నేతల ఫోన్లను కూడా ట్యాప్ చేస్తున్నారు’’ అని చెప్పుకొచ్చారు. ఫోన్ట్యాపింగ్కు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయన్నారు. ఆధారాలుంటే కేసీఆర్పై కేసు ఎందుకు నమోదు చేయట్లేదని విలేకరులు ప్రశ్నించగా.. కేంద్రప్రభుత్వానికి ఫిర్యాదు చేశామని, కేంద్రం స్పందించకపోతే తామే ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఏర్పాటుచేసి.. ఫోన్ట్యాపింగ్పై విచారణ చేస్తామని ఆయన బదులిచ్చారు.
రేవంత్రెడ్డి కేసును పక్కదోవ పట్టించేందుకు ఫోన్ట్యాపింగ్ వ్యవహారాన్ని తెరపైకి తెస్తున్నారా? అన్న ప్రశ్నకు.. రేవంత్ తప్పు చేసుంటే అనుభవిస్తారని, ఆయన కేసుతో తమకు సంబంధం లేదని, కోర్టు విచారణలో ఉన్నందున దానిపై మాట్లాడనని అచ్చెన్నాయుడు చెప్పారు. దేవినేని ఉమా మాట్లాడుతూ.. తెలంగాణ సీఎం కేసీఆర్ అవమానిస్తున్నది చంద్రబాబును కాదని.. ఐదు కోట్ల మంది తెలుగువారినని చెప్పారు.
బాబుకు నోటీసులిస్తే ఖబడ్దార్
Published Thu, Jun 11 2015 2:39 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చావ్లా అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో రెండో బౌలర్గా
గుడిలో సింపుల్గా పెళ్లి చేసుకున్న నటుడి కూతురు (ఫోటోలు)
పార్టీ ఆఫీసులో రాహుల్ గాంధీ పూజలు - వీడియో వైరల్
వెంకటేశ్ అయ్యర్ అద్భుత పోరాటం.. ముంబై టార్గెట్ ఎంతంటే?
సీఎం జగన్ రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇలా..
పిల్లల్ని ఎందుకు కనలేదో తొలిసారి చెప్పిన వితికా
ధనుష్తో విడిపోయిన ఐశ్వర్య.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)
సొంతగూటికి సంజయ్ నిరుపమ్
అమిత్షాపై కోడ్ ఉల్లంఘన కేసు
మళ్ళీ వచ్చారు...మౌత్ టాక్ మల్లిగాళ్ళు
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement