తహశీల్దారు ఆఫీసులో ఏసీబీ సోదాలు | ACB raids Tahsildar Office | Sakshi
Sakshi News home page

తహశీల్దారు ఆఫీసులో ఏసీబీ సోదాలు

Oct 16 2015 3:10 PM | Updated on Apr 4 2019 2:50 PM

భూ పంపిణీలో అవకతవకలపై అనంతపురం జిల్లా తలుపుల తహశీల్దారు కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ అధికారులు తనిఖీలు ప్రారంభించారు.

తలుపుల (అనంతపురం) : భూ పంపిణీలో అవకతవకలపై అనంతపురం జిల్లా తలుపుల తహశీల్దారు కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ అధికారులు తనిఖీలు ప్రారంభించారు. తలుపుల మండలం కుర్లి గ్రామంలో 2008-09 సంవత్సరంలో ప్రభుత్వం కొందరికి భూ పంపిణీ చేసింది.

అయితే భూమి అనర్హులకు పంచిపెట్టారంటూ నెల క్రితం కొందరు ఏసీబీకి ఫిర్యాదు అందింది. దీనిపై స్పందించిన ఏసీబీ హిందూపురం డీఎస్పీ భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు తలుపుల తహశీల్దార్ కార్యాలయంలో సంబంధిత దస్త్రాలను పరిశీలిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement