మైలవరం (కృష్ణా), భద్రాచలం టౌన్, న్యూస్లైన్: కృష్ణా జిల్లాలోని మైలవరం పట్టణ శివారులో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదం లో భద్రాచలానికి చెందిన ఒకరు మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్రంగా, ముగ్గురికి స్వల్పంగా గాయాలయ్యాయి. పదిమంది శివ స్వాములు భద్రాచలం నుంచి క్వాలిస్ వాహనంలో శ్రీశైలం వెళుతున్నారు. మైలవరం శివారులోని దర్గా సమీపంలో ఈ వాహనం వెనుక టైర్ పేలిపోయింది. దీంతో వాహనం అదుపు తప్పి పల్టీలు కొడుతూ రోడ్డు పక్కన నీరు లేని పంట కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో భద్రాచలం మండలంలోని తుమ్మల నగర్ గ్రామానికి చెందిన అపకా రామారావు(30) మృతిచెందారు. సిహెచ్.శోభన్బాబు, డి.దేవదాస్, డి.వినోద్, ఎం.విశ్వనాథ్, డి.మల్లేశ్వరమ్మ, పి.అన్నపూర్ణకు బలమైన గాయాలయ్యాయి. కె.అక్కయ్య, డి.శ్రీకాంత్, కె.మురళి స్వల్పంగా గాయపడ్డారు. వీరిని 108 సిబ్బంది స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన శోభన్బాబు, దేవదాస్, వినోద్, విశ్వనాథ్, మల్లేశ్వరమ్మ, అన్నపూర్ణను ప్రాథమిక చికిత్స అనంతరం 108 లో విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వాహనాన్ని డ్రైవర్ అతి వేగంగా నడిపినందునే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
శివయ్య దర్శనానికి వెళ్లొస్తానని... కానరాని లోకాలకు...
‘శ్రీశైలం శివయ్య దర్శనానికి వెళ్లొస్తా..’నంటూ ఇంట్లో చెప్పి బయల్దేరిన కొద్ది గంటల్లోనే అపకా రామారావును రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు కబళించింది. శివమాల వేసుకుని శ్రీశైలం బయలుదేరేముందు జరిగిన ఇరుముడి కార్యక్రమంలో అతనితో గడిపిన క్షణాలే ఆ కుటుంబానికి చివరి జ్ఞాపకాలయ్యాయి. రామారావు ప్రైవేట్ ఎలక్ట్రీషియన్గా చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అతని స్వగ్రామం గొమ్ముకొత్తగూడెం. డిగ్రీ అనంతరం కొత్తనారాయణపురం గ్రామానికి చెందిన నాగమణితో వివాహమైంది.
ఆ ఊరు పక్కనున్న తుమ్మల నగర్లో పూరి గుడిసెలో భార్య, ఇద్దరు పిల్లలతో నివసిస్తున్నాడు. ఇదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి శివమాల వేసుకోవడంతో... తాను కూడా శివమాల ధరించి నిష్టగా మాలధారణ పూర్తిచేశాడు. శ్రీశైలం వెళ్లేందుకుగాను ఇరుముడి కార్యక్రమం శుక్రవారం తెల్లవారుజామున స్థానిక శివాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో రామారావు తన భార్యాపిల్లలతో, బంధువులతో ఆనందంగా గడిపాడు. ‘శివయ్య వద్దకు వెళ్లొస్తా..’నని బయల్దేరాడు. ప్రమాదం జరిగిందని మిగిలిన స్వాముల నుంచి ఫోన్ రావడంతో రామారావు కుటుంబీకులు శోకసంద్రంలో మునిగిపోయారు. రామారావు తండ్రి, భార్య, బావమరిది కలిసి మైలవరం వెళ్లారు. రామారావు ఇంటి వద్ద అమాయకంగా చూస్తున్న అతని పిల్లలు తేజ(8), సాయిరాం(6) చూసి బంధువులు రోదిస్తున్నారు. రెక్కల కష్టం మినహా మరెలాంటి ఆదరువూ లేని తమ్ముడి కుటుంబానికి దిక్కెవరంటూ అతని అక్క, బంధువులు రోదిస్తున్నారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శోభన్కు టెంట్ హౌస్ ఉంది. దేవదాసు టైలర్గా పనిచేస్తున్నాడు.
శివ స్వాముల వాహనం బోల్తా
Published Sat, Dec 14 2013 6:33 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement