పాలబుగ్గల చిన్నారులు, బుడిబుడి నడకల పాపాయిలు సైతం పురుషుల కామవాంఛకు బలైపోతున్నారు. ఆడుకోడానికి వెళ్లిన ఆరేళ్ల చిన్నారిని ఒక మృగాడు మాయమాటలతో చెరుకు తోటలోకి తీసుకెళ్లాడు. లైంగికదాడికి పాల్పడ్డాడు. తర్వాత తాడుతో మెడకు బిగించి చంపాడు. ఇంతకూ ఈ చిన్నారి చేసిన పాపం ఏమిటి?
శ్రీకాళహస్తి/ఏర్పేడు, న్యూస్లైన్:
అన్నెం పుణ్నెం ఎరుగని ఆరేళ్ల చిన్నారి అత్యాచారం, హత్యకు గురికావడం ఏర్పేడు మండలంలోని కుక్కలగుంట ఎస్టీ కాలనీలో విషాదం నిం పింది. ఎస్టీ కాలనీకి చెందిన సుజాత(6) స్థానిక పా ఠశాలలో ఒకటో తరగతి చదువుతోంది. ఆదివారం మధ్యాహ్నం భోంచేసిన తర్వాత ఆడుకునేందుకు పాఠశాల వద్దకు వెళ్లింది. అదే గ్రామానికి చెందిన గిలకల చిన్నసుబ్బయ్యు కువూరుడు గిరి(25) బాలికకు మాయమాటలు చెప్పి చెరుకు తోటలోకి తీసుకెళ్లి లైంగికదాడి చేశాడు. బాలిక స్పృహ కోల్పోయింది. దీంతో బాలిక మెడను తాడుతో బిగిం చాడు. బాలిక చనిపోయిందని నిర్ధారించుకుని ఇంటికి వచ్చేశాడు. కాగా ఆదివారం సాయంత్రమే బాలిక కనిపించడం లేదని తల్లిదండ్రులు రేఖ, మణి పోలీసులకు ఫిర్యాదు చేశారు.మంగళవారం సుజాత మృతదే హాన్ని చెరకు తోటలో గుర్తించారు. బాలిక శరీరంపై పళ్ల గాట్లు, తాడుతో బిగించిన గుర్తులు ఉన్నాయి.
తిరుపతి అర్బన్ ఎస్పీ రాజశేఖరబాబు, డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ రామ్కువూర్, ఎస్ఐ విక్రమ్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్ సాయుంతో నిందితుడి ఆచూకీ కోసం ప్రయుత్నించారు. విషయం బయటకు పొక్కడంతో అత్యాచారం, హత్యకు పాల్పడిన గిరి పారిపోతుండగా రేణిగుంట వుండలంలోని అ త్తూరు సమీపంలో స్థానికులు జనార్దన్, సురేంద్ర పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో కుక్కలగుంట ఎస్టీకాలనీలో విషాదం నెలకొంది.
కఠినంగా శిక్షించాలి
బాలికపై అత్యాచారం హత్యకు పాల్పడిన గిరిని కఠినంగా శిక్షించాలని ఎస్టీ కాలనీ వాసులు కోరుతున్నారు. ఇతను గతంలో ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడని వారు తెలిపారు. గిరి మొదటి భార్య భర్త వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. అతను రెండో పెళ్లి చేసుకోగా, ఆమె కూడా ఇతని వేధింపులు తట్టుకోలేక ఇంట్లోనించి పారిపోయిందన్నారు. నేర చరిత్ర ఉన్న గిరిని కఠినంగా శిక్షించాలని గ్రావుస్తులు కోరారు.
ఆరునెలల్లో నాలుగో ఘటన
శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిధిలో ఆరునెలల్లో ఇలాంటి ఘటన జరగడం ఇది నాల్గవసారి. ఐదు నెలల క్రితం శ్రీకాళహస్తి వుండలం భీవువరంలో ఎనిమిదేళ్ల బాలిక పంటపొలాల్లో లైంగికదాడికి గురైన విషయుం తెలిసిందే. ఆ బాలిక అనారోగ్యంతో ఇప్పటికీ అవస్థలు పడుతోంది. శ్రీకాళహస్తి పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న నాలుగేళ్ల చిన్నారిపై తరగతిగదిలోనే కిందిస్థారుు ఉద్యోగి అత్యాచారానికి ఒడిగట్టాడు. మూడు నెలల క్రితం వుండలంలోని ఎగువవీధి గ్రావుంలో ఆడుకుంటూ దాహంతో మంచినీళ్లు తాగేందుకు స్నేహితురాలి ఇంట్లోకి వెళ్లిన చిన్నారిపై ఓ వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డ సంఘటన అప్పట్లో సంచలనలం రేపింది. ప్రస్తుతం ఏర్పేడు మండలంలో ఆరేళ్ల సుజాత అత్యాచారం, హత్యకు గురికావడం ఈ ప్రాంతవాసులను మరింత ఆందోళనకు గురిచేసింది. ఇలాంటి నేరాలపై పోలీసులు అధి కారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
చిన్నారులను చిదిమేస్తున్నారు
Published Wed, Sep 11 2013 4:15 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
డీప్ ఫేక్ బారిన స్టార్ హీరోయిన్.. వీడియో వైరల్!
బీజేపీకి ఆదరణ పెరుగుతోంది
విద్యతోపాటు సంస్కారం ప్రధానం
పోలింగ్ను నిశితంగా పరిశీలించాలి
ఎన్నికల వేళ తనిఖీలు ముమ్మరం
ప్రచార పాట్లు
ఎన్నికల నిబంధనలు పాటించాలి
ఈవీఎంల ర్యాండమైజేషన్ పూర్తి
గ్యారంటీలు అమలైతే ఓట్లడగం
ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
తప్పక చదవండి
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- రోహిత్కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement