సాక్షి, హైదరాబాద్: పేదల కోసం నిర్మించ తలపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఇకపై మరింత భారం కానుంది. ఈ ఇళ్ల నిర్మాణానికి ఉపయోగిస్తున్న ఇటుకలపై పన్ను వసూలు చేసేందుకు రాష్ట్ర సర్కారు సిద్ధమైంది. ఇందులో భాగంగా గడచిన నాలుగేళ్లుగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ళ లెక్కలను ఇవ్వాలని గృహ నిర్మాణ శాఖను వాణిజ్య పన్నుల శాఖ కోరుతోంది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీలు, మున్సిపాల్టీలు, కార్పొరేషన్లు అనుమతులు మంజూరు చేసిన ఇళ్లు, ఫ్లాట్ల నిర్మాణాలపైనా ఆరా తీస్తోంది. వీటి ఆధారంగా ఎంత ఇటుక వాడారు? వాటి ఖరీదు ఎంత? వాటికి ఎంత పన్ను చెల్లించాలనే లెక్కలు వేయాలని అంచనా వేస్తోంది. ఫిబ్రవరిలోగా ఇందుకు సంబంధించిన అన్ని వివరాలూ పంపాలని జిల్లా అధికారులను వాణిజ్య పన్నుల శాఖ విభాగం ఆదేశించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. గడచిన నాలుగేళ్ల కాలంలో రాష్ట్రంలో సుమారు 30 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించినట్టు అంచనా. వీటికి తోడు మున్సిపాల్టీలు, నగర పాలక సంస్థలు అనుమతి ఇచ్చిన ఫ్లాట్లు, ఇళ్ల నిర్మాణాలు 47 లక్షల వరకూ ఉంటాయని అధికారులు భావిస్తున్నారు.
మేజర్ గ్రామ పంచాయతీల్లోని నిర్మాణాలను కూడా కలుపుకుంటే ఈ సంఖ్య రెట్టింపు ఉంటుందని లెక్కగడుతున్నారు. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ లెక్కల ప్రకారం ఒక్కో ఇందిరమ్మ ఇంటికీ 10 వేల వరకూ ఇటుక వాడుతున్నారు. అపార్టమెంట్ నిర్మాణాలకు 50 నుంచి 80 వేల ఇటుకల అవసరం ఉంటుంది. వీటికి ఎక్కడి నుంచి ఇటుకలు తెస్తున్నారనే వివరాలు అధికారుల వద్ద లేవు. అయితే ఇటుకలపై 5 శాతం అమ్మకం పన్ను వసూలు చేయాలనే నిబంధన మాత్రం ఉంది. మూడేళ్ల క్రితం వరకూ ఒక్కో ఇటుక రూ. 3.50 ఉండేది. మట్టి తవ్వకాలపై ఆంక్షలు విధించడంతో రూ. 5కి పైగా పెరిగింది. ఈ లెక్కన ఇందిరమ్మ ఇళ్లకే కోట్ల రూపాయల విలువైన ఇటుకను వాడారు. అపార్ట్మెంట్లు, పట్టణాలు, పంచాయతీల్లో నిర్మాణాలను కలుపుకుంటే, ఈ నాలుగేళ్లలో సుమారు రూ. 500 కోట్ల అమ్మకం పన్ను రాబట్టవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే నాలుగేళ్ల పన్ను వసూలు విషయమై ప్రభుత్వం నుంచి ఆమోదముద్ర పడాల్సి ఉంది.
ఇటుకలపై 5 శాతం పన్ను
Published Thu, Jan 2 2014 1:04 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement