కలుషితాహారం: 25 మందికి అస్వస్థత | 25 students hospitalised in vijayanagaram | Sakshi
Sakshi News home page

కలుషితాహారం: 25 మందికి అస్వస్థత

Jul 30 2015 12:56 PM | Updated on Sep 3 2017 6:27 AM

కలుషితాహారంతో విద్యార్థినులు అస్వస్థతకు గురైన విజయనగరం జిల్లా కేంద్రంలోని బాబామెట్టలో ఉన్న కస్తూరిభా ఆశ్రమ పాఠశాలలో గురువారం ఉదయం జరిగింది.

విజయనగరం: కలుషితాహారంతో విద్యార్థినులు అస్వస్థతకు గురైన విజయనగరం జిల్లా కేంద్రంలోని బాబామెట్టలో ఉన్న కస్తూరిభా ఆశ్రమ పాఠశాలలో గురువారం ఉదయం జరిగింది. పాఠశాలలో ఉన్న 25 మంది బాలికలకు ఉదయం టిఫిన్‌గా పెరుగన్నం వడ్డించారు. అది తిన్న కొద్దిసేపటికే బాలికలంతా తీవ్ర కడుపునొప్పి, విరేచనాలతో బాధపడ్డారు. నిర్వాహకులు వారందరినీ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి 108 వాహనంలో తరలించారు. పరీక్షించిన వైద్యులు వెంటనే చికిత్స ప్రారంభించారు. ఎవరికీ ఎటువంటి ప్రమాదం వైద్యులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement