రోడ్డు ప్రమాదంలో 24 గొర్రెలు మృతి | 24 sheeps died in a road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో 24 గొర్రెలు మృతి

Feb 28 2015 2:36 PM | Updated on Aug 30 2018 3:56 PM

రోడ్డు ప్రమాదంలో 24 గొర్రెలు మృతి - Sakshi

రోడ్డు ప్రమాదంలో 24 గొర్రెలు మృతి

రెంటచింతల మండల కేంద్రమైన రెంటచింతల గ్రామశివార్లోని గోలివాగు వద్ద రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలోలారీ కిందపడి 24 గొర్రెలు మృతి చెందాయి.

గుంటూరు: రెంటచింతల మండల కేంద్రమైన రెంటచింతల గ్రామశివార్లోని గోలివాగు వద్ద రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలోలారీ కిందపడి 24 గొర్రెలు మృతి చెందాయి. వివరాలు... మహబూబ్‌నగర్ జిల్లా అమరాబాద్ మండలంలోని వంకేశ్వరం గ్రామానికి చెందిన యడ్లశ్రీను, తగుళ్ల మల్లయ్యలు తమ గొర్రెలను తూర్పులో మేపుకొని మాచర్లవైపుకు వెళ్తున్నారు. గోలివాగు బ్రిడ్జి దాటిన సమయంలో గుర్తుతెలియని ఓ లారీ గొర్రెలపైనుంచి వెళ్లగా  24 గొర్రెలు అక్కడికక్కడే మృతిచెందాయి.  ఈ ప్రమాదంతో రూ.3.60 లక్షలు నష్టం వాటిళ్లిందని బాదితులు శ్రీను,మల్లయ్యలు తెలిపారు. ఈ సంఘటనపై స్థానిక పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
(రెంటచింతల)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement