పెళ్లి ట్రాక్టర్ బోల్తా : 20 మందికి గాయాలు | 20 injured in road accident at kurnool distirict | Sakshi
Sakshi News home page

పెళ్లి ట్రాక్టర్ బోల్తా : 20 మందికి గాయాలు

Feb 5 2015 10:53 AM | Updated on Sep 2 2017 8:50 PM

కర్నూలు జిల్లా ఓర్వకల్ మండలంలోని ఉప్పలపాడు వద్ద గురువారం పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది.

కర్నూలు:  కర్నూలు జిల్లా ఓర్వకల్ మండలంలోని ఉప్పలపాడు వద్ద గురువారం పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో 20 మందికి తీవ్రగాయాలయ్యాయి. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వివరాలు... వెల్దుర్తి మండలం కిస్టాపురానికి చెందిన ట్రాక్టర్  కాలువబుగ్గ దేవస్థానంలో జరుగుతున్నపెళ్లికి బయలుదేరింది. ఉప్పలపాడు వద్ద రాగానే ట్రాక్టర్ ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తాపడింది.

ఈ ప్రమాదంలో ట్రాక్టర్ లో ఉన్న 20 మందికి గాయాలయ్యాయి. స్తానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితుల్లో ముగ్గురి పరిస్థితి ఆందోళనకంరగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
(ఓర్వకల్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement