లారీ-బైక్ ఢీ... ఇద్దరు మృతి


గుంటూరు: గుంటూరు జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందగా మరో యువకుడికి గాయాలయ్యాయి. నల్లపాడు శ్రీనివాస కాలనీ నుంచి తెనాలి వైపు వెళుతుండగా అర్ధరాత్రి 2 గంటల సమయంలో యువకులు ప్రయాణిస్తున్న బైక్‌ను ఎదురుగా వచ్చిన గ్యాస్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైకుపై ప్రయాణిస్తున్న తెనాలి వాసి వెంకటేష్(22), ఏటుకూరు వాసి నరేంద్రకుమార్(25) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, తీవ్ర గాయాలపాలైన రాజేష్(22)ను ఆస్పత్రికి తరలించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top