బొలెరోను ఢీకొన్న బస్సు: ఒకరి మృతి


కురబలకోట: చిత్తూరు జిల్లా కురబలకోట మండలం బాదంవారిపల్లి వద్ద టమాటా లోడుతో వెళుతున్న బొలెరోను ఆర్టీసీ బస్సు ఢీకొంది. మంగళవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో బొలెరో డ్రైవర్ అశోక్ (22) అక్కడికక్కడే మృతి చెందాడు. బొలెరో వాహనంలో ఉన్న మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని మదనపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అశోక్ తంబళ్లపల్లి మండలానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. 
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top