బొలెరోను ఢీకొన్న బస్సు: ఒకరి మృతి | 1 died in road accident at chittor district | Sakshi
Sakshi News home page

బొలెరోను ఢీకొన్న బస్సు: ఒకరి మృతి

Jan 12 2016 11:20 AM | Updated on Sep 3 2017 3:33 PM

చిత్తూరు జిల్లా కురబలకోట మండలం బాదంవారిపల్లి వద్ద టమాటా లోడుతో వెళుతున్న బొలెరోను ఆర్టీసీ బస్సు ఢీకొంది.

కురబలకోట: చిత్తూరు జిల్లా కురబలకోట మండలం బాదంవారిపల్లి వద్ద టమాటా లోడుతో వెళుతున్న బొలెరోను ఆర్టీసీ బస్సు ఢీకొంది. మంగళవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో బొలెరో డ్రైవర్ అశోక్ (22) అక్కడికక్కడే మృతి చెందాడు. బొలెరో వాహనంలో ఉన్న మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని మదనపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అశోక్ తంబళ్లపల్లి మండలానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. 

Advertisement
 
Advertisement
Advertisement