తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం దివాన్ చెరువ గ్రామం వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం చోటుచేసుకుంది.
రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం దివాన్ చెరువ గ్రామం వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నయువకుడిని ఐచర్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతిచెందిన యువకుడు రాజానగరం మండలం నరేంద్రపురం గ్రామానికి చెందిన శివ(18)గా గుర్తించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.