ఈయన పేరు బి.అశోక్. బద్వేలులోని రఘునాథపురంలో నివాసం ఉంటున్నాడు. వీరిది సాధారణ రైతు కుటుంబం. ‘నేను ఉన్నత చదువులు చదువుకోగలిగానంటే దివంగత మహానేత వైఎస్రాజశేఖర్రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజురీయింబర్స్మెంట్ పథకమే. ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీలతోపాటు బీఈడీ, పీహెచ్డీలకు ఫీజురీయింబర్స్మెంట్ పథకం ఎంతగానో ఆదుకుంది. ప్రస్తుతం ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాల డీన్గా పని చేస్తున్నాను. ఇంతటి గౌరవం నాకు దక్కిందంటే అదంతా దివంగత వైఎస్రాజశేఖరరెడ్డి పుణ్యమే’ అని బి.అశోక్ పేర్కొంటున్నాడు.


