బద్వేలు అర్బన్ : బద్వేలులోని పలు ప్రభుత్వ పాఠశాలలకు స్మార్ట్కిచెన్ ద్వారా అందించే మధ్యాహ్న భోజనం ఆలస్యమై విద్యార్థులు ఆకలితో అలమటించిన విషయంపై సాక్షి దినపత్రికలో శనివారం ప్రచురితమైన ‘స్మార్ట్ కిచెన్ .. కడుపులు మాడ్చెన్’ కథనానికి జిల్లా, మండల విద్యాశాఖాధికారులు స్పందించారు. ఘటనపై జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం నుంచి ఆరా తీయడంతోపాటు వివరణ ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిసింది. అలాగే మండల పరిఽధిలోని ఆయా ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు శనివారం ఉదయం 11–30 గంటలకే అన్ని పాఠశాలలకు మధ్యాహ్న భోజనాన్ని సరఫరా చేశారు.


