కోట్ల రూపాయల ప్రజాధనంతో 80 శాతం పూర్తి చేసిన క్రికెట్ స్టేడియాన్ని కూటమి ప్రభుత్వం తక్షణమే వినియోగంలోకి తీసుకురావాలి. జిల్లాలో ఎంతోమంది ప్రతిభావంతులైన క్రీడాకారులు ఈ మైదానం ఎప్పుడు అందుబాటులోకి వస్తుందా అని రెండేళ్లుగా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. స్టేడియం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడలను, క్రీడాకారులను మరింతగా ప్రోత్సహించవచ్చు. కేవలం 20 శాతం పెండింగ్ పనులను పూర్తి చేసి, గేట్లు తెరిస్తే ఈ ప్రాంత యువతకు ఎంతో మేలు జరుగుతుంది.
– నాగేంద్ర, క్రికెట్ క్రీడాకారుడు, పులివెందుల.


