కూటమి రాకతో గాలికి..
వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొనసాగి ఉంటే ఈపాటికి విశ్వవిద్యాలయ కార్యాచరణ మొదలై దాని ఫలితాలు కనిపించేవి. కూటమిపాలన రాకతోనే ఈ కళాశాలను నిర్లక్ష్యం చేశారు. ఇంటర్మీడియట్ కోర్సులు ఎత్తేశారు. డిగ్రీ కళాశాల నిర్వహణ ఉన్నప్పటికీ, దాని అభివృద్ధికి ఒక్క చర్య తీసుకోలేదు. అడ్మిషన్ల పరిస్థితి, అధ్యాపకులు, సిబ్బంది స్థితిగతులపైనా సమీక్ష లేదు. ప్రిన్సిపాల్ రిటైర్ అయి నెలలు గడుస్తున్నా రెగ్యులర్ ప్రిన్సిపాల్ నియామకం లేదు. విద్యార్థుల సంఖ్య పెంచే చర్యలు శూన్యం. చరిత్ర కలిగిన కళాశాల విషయంలో కూటమి పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. దీని ఫలితంగానే విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ముందడుగు పడటం లేదు. దీనిని గత ప్రభుత్వం చేపట్టింది, తమకెందుకనే ధోరణి వ్యక్తం అవుతోంది. దాంతో పేద విద్యార్థులకు అందించే విద్యపైన రాజకీయాలు మొదలయ్యాయి. ప్రస్తుతం డిగ్రీకళాశాలలో మూడేళ్లకు కలిపి కేవలం 154 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు.


