పెన్నానదిలో యువకుడి గల్లంతు | - | Sakshi
Sakshi News home page

పెన్నానదిలో యువకుడి గల్లంతు

Aug 14 2025 7:13 AM | Updated on Aug 14 2025 7:13 AM

పెన్నానదిలో యువకుడి గల్లంతు

పెన్నానదిలో యువకుడి గల్లంతు

ప్రొద్దుటూరు క్రైం : స్థానిక రామేశ్వరం సమీపంలోని రెండు కుళాయిల వద్ద ఉన్న పెన్నానదిలో నాయుని విక్రమ్‌ (20) అనే యువకుడు గల్లంతయ్యాడు. రూరల్‌ పోలీసులు తెలిపిన మేరకు.. మిట్టమడివీధికి చెందిన నాయుని విక్రమ్‌ వన్‌టౌన్‌ సర్కిల్‌లోని టీ దుకాణంలో మాస్టర్‌గా పని చేస్తున్నాడు. అతను తన స్నేహితులు వెంకటసాయి, ముత్తయ్య, శివలింగమయ్యలతో కలిసి బుధవారం పెన్నానదికి వెళ్లాడు. మిత్రులందరూ పెన్నానదిలో కొంత సేపు సరదాగా గడిపారు. కొంత సేపటి తర్వాత మళ్లీ వస్తానని చెప్పి విక్రమ్‌ వారికి దూరంగా వెళ్లాడు. అలా వెళ్లిన అతను నీటిలో గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని బోటు సాయంతో నదిలో గాలించారు. నీరు ఎక్కువగా ప్రవహిస్తుండటంతో విక్రమ్‌ ఆచూకీ తెలియలేదు. దీంతో కుటుంబ సభ్యులు రోదించసాగారు. యువకుడి తల్లి రుక్మిణీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్‌ పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement