బ్రహ్మంసాగర్‌ ఎడమ కాలువకు నీరు విడుదల | - | Sakshi
Sakshi News home page

బ్రహ్మంసాగర్‌ ఎడమ కాలువకు నీరు విడుదల

Aug 10 2025 5:50 AM | Updated on Aug 10 2025 5:50 AM

బ్రహ్మంసాగర్‌ ఎడమ  కాలువకు నీరు విడుదల

బ్రహ్మంసాగర్‌ ఎడమ కాలువకు నీరు విడుదల

బ్రహ్మంగారిమఠం : బ్రహ్మంసాగర్‌ రిజర్వాయర్‌ నుంచి శనివారం తెలుగుగంగ ఇన్‌చార్జి ఎస్‌ఈ వెంకటరామయ్య ఎడమ కాలువకు 200 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల అవసరాల కోసం సాగర్‌ కుడి కాలువకు 150 క్యూసెక్కులు, ఎడమ కాలువకు 200 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. సాగర్‌లోకి 1350 క్యూసెక్కుల నీరు చేరుతోందన్నారు. ప్రస్తుతం 6 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీరు వస్తుందన్నారు. రైతులు సాగు నీటిని వృథా చేయకుండా వాడుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సి.వీరనారాయణరెడ్డి, మండల టీడీపీ అధ్యక్షుడు చెన్నుపల్లె సుబ్బారెడ్డి, ఎస్సార్‌ శ్రీనివాసులరెడ్డి, జోగయ్య, నరసింహులు, సాంబశివారెడ్డి, నారాయణ యాదవ్‌, శివయ్య యాదవ్‌, డీఈఈ మురళీమోహన్‌, ఏఈఈ మద్దం నాగేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement