
యువతి ఆత్మహత్యాయత్నం
పోరుమామిళ్ల : పట్టణంలోని పాత చాకలవీధికి చెందిన స్వాతి(22) శుక్రవారం సాయంత్రం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఏఎస్ఐ దుర్గామోహన్ వివరాల మేరకు.. స్థానికుడు అంజి అనే యువకుడిని స్వాతి ప్రేమ వివాహం చేసుకుంది. ఇటీవల స్వాతి అనారోగ్యానికి గురికావడం, అంజి వైద్యం చేయించకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యాయత్నం చేసిందని ఏఎస్ఐ తెలిపారు. విచారణలో పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు.
కారు అద్దాలు ధ్వంసం
కడప అర్బన్ : కడప నగరం శంకరాపురంలో గురువారం రాత్రి గుర్తుతెలియని ఆకతాయిలు కారు అద్దాలను ధ్వంసం చేశారు. శంకరాపురానికి చెందిన వ్యక్తులకు సంబంధించిన మూడు కార్లు ఖాళీ ప్రదేశంలో పార్కింగ్ చేశారు. గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో కారుపై విసరడంతో ముందు, వెనుక అద్దాలు పగిలిపోయాయి. చిన్న చౌక్ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
రైలు మరుగుదొడ్డిలో
మృతదేహం
కడప కోటిరెడ్డిసర్కిల్ : ముంబయి నుంచి చైన్నెకు వెళుతున్న స్పెషల్ రైలు (01015)లోని ఎస్–6 బోగీ మరుగుదొడ్డిలో గుర్తుతెలియని మృతదేహాన్ని (35) రైల్వే పోలీసులు శుక్రవారం గుర్తించారు. ప్రయాణీకుల ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కడప రిమ్స్ మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని కడప రైల్వే జీఆర్పీ ఎస్ఐ తెలిపారు.
65 మద్యం సీసాల సీజ్
ఎర్రగుంట్ల(జమ్మలమడుగు) : యర్రగుంట్ల రైల్వే స్టేషన్లో ఇద్దరు వ్యక్తుల నుంచి 65 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు యర్రగుంట్ల ఆర్పీఎఫ్ సీఐ శ్రీనివాసులు, జీఆర్పీఎఫ్ ఎస్ఐ సునీల్కుమార్రెడ్డి తెలిపారు. వారు తెలిపిన వివరాల మేరకు.. యర్రగుంట్ల రైల్వేస్టే్షన్లో ఆర్పీఎఫ్, జీఆర్పీఎఫ్ పోలీసులు శుక్రవారం సంయుక్తంగా తనిఖీలు చేశారన్నారు. ఫూణె ఎకై ్సప్రెస్ రైలులో నుంచి ఇద్దరు వ్యక్తులను అనుమానంతో తనిఖీ చేసి వారి నుంచి పాండిచ్చేరికి చెందిన 65 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వాటి విలువ రూ.20 వేలు ఉంటుందన్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు.
ఫ్లైయాష్ ట్యాంకర్ బోల్తా
జమ్మలమడుగు రూరల్ : జమ్మలమడుగు– ప్రొద్దుటూరు బైపాస్ రోడ్డులో ఫ్లైయాష్ ట్యాంకర్ శుక్రవారం అదుపు తప్పి బోల్తాపడి డ్రైవర్కు తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల వివరాల మేరకు.. ప్రొద్దుటూరు నుంచి బయలుదేరిన ఫ్లైయాష్ ట్యాంకర్ జమ్మలమడుగు శివారుకు రాగానే జమ్మలమడుగు– ప్రొద్టుటూరు బైపాస్ రోడ్డు మలుపు వద్ద వేగాన్ని అదుపు చేయలేక సర్కిల్లోని ప్లడ్ లైట్లకు ఢీకొని బోల్తా పడింది. ఈ సంఘటనలో డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం ప్రొద్దుటూరుకు తరలించారు. డ్రైవర్ అపస్మారక స్థితిలో ఉండటంతో వివరాలు అందలేదు. ఈ విషయమై పట్టణ ఎస్ఐ రామక్రిష్ణ వివరణ కోరగా తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదన్నారు.

యువతి ఆత్మహత్యాయత్నం

యువతి ఆత్మహత్యాయత్నం

యువతి ఆత్మహత్యాయత్నం