నేడు మంత్రి సవిత రాక | - | Sakshi
Sakshi News home page

నేడు మంత్రి సవిత రాక

Apr 29 2025 7:11 AM | Updated on Apr 29 2025 7:13 AM

కడప సెవెన్‌రోడ్స్‌ : జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్‌.సవిత మంగళవారం ఒక రోజు పర్యటన నిమిత్తం కడపకు రానున్నారు. ఈ సందర్భంగా ఆమె పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. నగరంలోని ఎర్రముక్కపల్లిలో రూ.3.66 కోట్లతో నిర్మించనున్న సీపీ బ్రౌన్‌ అదనపు స్మారక గ్రంథాలయం, భాషా పరిజ్ఞానం కేంద్రం నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. ఆర్ట్స్‌ కాలేజీ సమీపంలో రూ.10 కోట్లతో నిర్మించనున్న స్టార్టప్‌ హబ్‌ భవన సముదాయ నిర్మాణానికి కూడా మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం హార్టికల్చర్‌ డిపార్టుమెంట్‌ ఆధ్వర్యంలో నిర్వహించనున్న హార్టికల్చర్‌ కన్‌ క్లేవ్‌–2025 కార్యక్రమంలో పాల్గొననున్నారు.

రేపు డయల్‌ యువర్‌ ఆర్‌ఎం

కడప కోటిరెడ్డిసర్కిల్‌ : ఏపీఎస్‌ ఆర్టీసీ ప్రయాణికుల సమస్యలే పరిష్కారంగా నిర్వహిస్తున్న డయల్‌ యువర్‌ ఆర్‌ఎం కార్యక్రమాన్ని ఈనెల 30వ తేది నిర్వహించనున్నట్లు జిల్లా ప్రజా రవాణాధికారి పొలిమేర గోపాల్‌రెడ్డి తెలిపారు. బుధవారం సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుందని.. ప్రయాణికులు 99592 25848 నెంబరుకు ఫోన్‌ చేసిగానీ వాట్సాప్‌ చేసిగాని తమ సమస్యలు తెలియజేయవచ్చన్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

పాడి రైతులకు

రాయితీతో దాణా

కడప అగ్రికల్చర్‌ : జిల్లాలో పాడి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం రాయితీతో సమీకృత దాణాను అందిస్తుందని జిల్లా పశుసంవర్థశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ శారదమ్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 50 కేజీల దాణా బ్యాగు పూర్తి ధర రూ. 1110 కాగా ప్రభుత్వం 50 శాతం రాయితీతో రూ. 555లకే అందిస్తుందని తెలిపారు. దాణా అవసరమైన పాడి రైతులు రైతు సేవా కేంద్రాల్లోగానీ, మండలాలోని పశువైద్యాధికారులను గానీ సంప్రదించాలని సూచించారు. భారత్‌ పశుధన్‌ యాప్‌లో రైతు పేరు నమోదు అయి ఉండాలని దీంతోపాటు పశువులకు టీకాలు వేసి ఉండాలని తెలిపారు. కేవలం తెల్లరేషన్‌ కార్డు కల్గిన పాడి రైతులకు ప్రారంభంగా 2,3 పశువులు కలిగిన వారికి ఒక బ్యాగు మాత్రమే అందిస్తామని పేర్కొన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

వైభవంగా పల్లకి సేవ

రాయచోటి టౌన్‌ : రాయచోటి భధ్రకాళీ సమేతుడికి పల్లకీ సేవ నిర్వహించారు. సోమవారం రాత్రి మూల విరాట్‌లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపారు. ఉత్సవ మూర్తులను వివిధరకాల పూలు, పట్ట వస్త్రాలు, బంగారు ఆభరణాలతో అందంగా అలంకరించి పల్లకీలో కొలువుదీర్చారు.ఆలయ మాఢవీధుల్లో ఊరేగించారు. కార్యక్రమంలో ఈవో డివి రమణారెడ్డి, స్థానికులతోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు పాల్గొన్నారు.

నూతన నియామకం

రాజంపేట : రిప్లబికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా జిల్లా అధ్యక్షునిగా చౌడవరం సుబ్బనరసయ్య నియమితులయ్యారు. ఈమేరకు ఆర్‌పీ నేషనల్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎం.వెంకటస్వామి ఉత్తర్వులను విడుదల చేశారు. కేంద్రమంత్రి (సామాజికన్యాయం, సాధికారిత) రాందాస్‌ అత్వాలే ఆదేశాల మేరకు రైల్వేకోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లె మండలం బొమ్మవరానికి చెందిన సుబ్బనర సయ్యను జిల్లా అధ్యక్షునిగా నియమించారు.

నిధుల దుర్వినియోగంపై విచారణ

వీరబల్లి : మండలంలో తాటిగుంటపల్లి పంచాయతీలో నిధులు దుర్వినియోగం జరిగాయంటూ పంచాయతీలోని కొందరు తెలుగుదేశం పార్టీ నాయకులు సర్పంచ్‌పై ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు సోమవారం జిల్లా ఇన్‌చార్జి పంచాయతీ అధికారి (డీపీఓ) ఖాదర్‌వల్లి విచారణ జరిపారు. ఫిర్యాదుదారులను సచివాలయానికి పిలిపించి వారి సమక్షంలో రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా డీపీఓ స్థానిక విలేకరులతో మాట్లాడుతూ నిధుల దుర్వినియోగానికి సంబంధించి నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులకు పంపుతామని తెలిపారు.

నేడు మంత్రి సవిత రాక 1
1/2

నేడు మంత్రి సవిత రాక

నేడు మంత్రి సవిత రాక 2
2/2

నేడు మంత్రి సవిత రాక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement