
మనుంటి ముంగిటే సాంకేతిక విద్య!
కడప ఎడ్యుకేషన్: మౌలానా అజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (మను) అనుబంధ సంస్థ ‘మను’ పాలిటెక్నిక్ కళాశాల జిల్లా విద్యార్థులకు వరంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం దీనిని కడప నగర శివార్లలోని రిమ్స్ వద్ద 10.15 ఎకరాల స్థలాన్ని కేటాయించి యూనివర్సిటీ గ్రాంట్ కమీషన్, మినిస్ట్రియల్ ఆఫ్ ఎడ్యుకేషన్ వారి ఆర్థిక సహాయంతో రూ. 25 కోట్లతో నూతన భవనాలతోపాటు ఇన్ప్ట్రాస్టకర్స్, కంప్యూటర్ లాబ్య్, ఫిజిక్స్ ల్యాబ్, లైబ్రరీ వంటివి ఏర్పాటు చేశారు. అలాగే కళాశాల ఆవరణం మొత్తం ప్రహరీని ఏర్పాటు చేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ ఆధ్వర్యంలో భారతదేశ వ్యాప్తంగా బీహార్లోని దర్గాంగ్, ఒరిస్సాలోని కటక్, కర్నాటకలోని బెంగులూరు, తెలంగాణలోని హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్లోని కడపలో మాత్రమే ఈ పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి.
ఏయే కోర్సులు అందుబాటులో ఉన్నాయంటే..
మను పాలిటెక్నిక్ కళాశాలలో నాలుగు రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇందులో డిప్లమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్, డిప్లమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్, డిప్లమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, డిప్లమా ఇన్ అప్పరల్ టెక్నాలజీ కోర్సులు ఉన్నాయి. ఇందులో ప్రతి కోర్సుకు 60 సీట్ల చొప్పున 240 సీట్లు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులకు కంప్యూటర్ ల్యాబ్, సెంట్రల్ లైబ్రరీలతోపాటు అన్ని కోర్సులకు సంబంధించి వర్కుషాపులు ఉన్నాయి.
మే 13 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు....
మను పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశానికి మే 13 తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ప్రవేశ పరీక్ష జూన్ 13వ తేదీ కడప సమీపంలోని రిమ్స్ వద్ద ఉన్న మను పాలిటెక్నిక్ కళాశాలలో మధ్యాహ్న 2 గంటల నుంచి 4 గంటల వరకు ఉంటుంది. ఇందులో ప్రవేశ పరీక్షకు బాలికలు రూ.350, బాలురు రూ.550 రుసుం చెల్లించాల్సి ఉంటుంది. విద్యార్థులకు వచ్చిన ర్యాంకుల బట్టి రోస్టర్ కమ్ మెరిట్ ప్రకారం సీట్లు భర్తీ చేస్తారు.
● ప్రవేశానికి అర్హులెవరంటే...
ఈ మను పాలిటెక్నిక్ కళాశాలలో అన్ని కేటగిరీలకు చెందిన విద్యార్థులు చేరవచ్చు. ఇందులో ప్రత్యేకత ఏంటంటే ఏ కేటగిరికి చెందిన వారైనా సరే పదవ తరగతిలో తెలుగు, ఇంగ్లీష్ మీడియంలలో చదువుతున్నా సరే లాంగ్వేజికి సంబంధించి ఉర్దూ సబ్జెక్టు లేదా ఉర్దూ మీడియంలో చదివే వారే ఇందులో సీటుకు అర్హులు. ఇందులో చేరాలనుకునే వారు ఖచ్చితంగా ప్రవేశ పరీక్షను రాసి ర్యాంకును సాధించాలి. అలా ర్యాంకులు సాధించిన వారికి కేటగిరీల(ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పిజికల్ హ్యాండీక్యాప్, ఉమెన్ కోటా) వారిగా రోస్టర్ కమ్ మెరిట్ ప్రకారం సీట్లను కేటాయిస్తారు. ఇందులో చేరే వారిలో ఆడపిల్లలకైతే మూడేళ్లకు రూ.13,100లు, మగపిల్లలు మూడేళ్లకు రూ.14,700 లు, వికలాంగ విద్యార్థులు మూడేళ్లకు రూ. 5100 రూపాయిల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఇందులో చదువుకునే విద్యార్థులకు ప్రభుత్వం నుంచి వచ్చే ఫీజు రీయింబర్స్మెంట్తోపాటు నేషనల్ స్కాలర్షి ప్స్ వంటికి కూడా పొందవచ్చు.
వెబ్సైట్ ద్వారా...
మను పాలిటెక్నిక్ కళాశాలలకు సంబంధించిన అడ్మిషన్ సమాచారం కోసం htpp:// manucoe.in /regular adimission వెబ్సైట్ను సంప్రదించాలి. ఈ వెబ్సైట్ ద్వారా మరింత సమగ్ర సమాచారం తెలుసుకోవచ్చు. దీంతోపాటు అడ్మిషన్ల పరంగా ఏదైనా సందేహాలు, సమాచారం కోసం 9398083058 నెంబర్కు కాల్ చేసి సంప్రదించవచ్చు.
– మొహమ్మద్ సికిందర్ హుస్సేన్,
అడ్మిషన్ కన్వీనర్, మను పాలిటెక్నిక్ కళాశాల
అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
ఏపీలో భాగంగా కడపలో ఏర్పాటు చేసిన మను పాలిటెక్నిక్ కళాశాలను జిల్లా విద్యార్థులు వినియోగించుకోవాలి. ఈ కళాశాలలో డిప్లమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్, డిప్లమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్, డిప్లమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, డిప్లమా ఇన్ అప్పరెల్ టెక్నాలజీ కోర్సులు ఉన్నాయి. ఈ నాలుగు కోర్సులకు సంబంధించి 240 సీట్లు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – మీర్జా విలయత్ అలీ బేగ్,
ఇన్చార్జు ప్రిన్సిపాల్, మను పాలిటెక్నిక్
కళాశాల, వైఎస్సార్జిల్లా
విద్యార్థుల బంగరు భవితకు బాటలు వేస్తున్న ‘మను’ పాలిటెక్నిక్
నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ ఆధ్వర్యంలోఏపీలో ఏకై క పాలిటెక్నిక్ కళాశాల
నాలుగు బ్రాంచుల్లో ఏటా 240 సీట్లు కేటాయింపు
మే 13 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ
కళాశాల ప్రవేశానికి జూన్ 13న ప్రవేశ పరీక్ష నిర్వహణ

మనుంటి ముంగిటే సాంకేతిక విద్య!

మనుంటి ముంగిటే సాంకేతిక విద్య!

మనుంటి ముంగిటే సాంకేతిక విద్య!

మనుంటి ముంగిటే సాంకేతిక విద్య!

మనుంటి ముంగిటే సాంకేతిక విద్య!