రోజుకు ఆరు లీటర్లు నీరు తాగాలి | - | Sakshi
Sakshi News home page

రోజుకు ఆరు లీటర్లు నీరు తాగాలి

Apr 27 2025 12:52 AM | Updated on Apr 27 2025 12:52 AM

రోజుక

రోజుకు ఆరు లీటర్లు నీరు తాగాలి

వేగంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో చర్మంలోని నీటి శాతం పూర్తిగా ఆవిరైపోతుంది. ఎండ విపరీతంగా పెరగడంతో చెమట ద్వారా సోడియం లవణాలు ఎక్కువగా వెళ్లిపోతాయి. కొంత పొటాషియం లవణాలు కూడా వెళ్లిపోవడంతో హీట్‌ హైపర్‌ పైరెక్సియా అనే వడదెబ్బ సొకే ప్రమాదం ఉంది. దీంతో జ్వరం, మగతగా కమ్మటం, వాంతులు రావడం జరుగుతుంది. లవణాల శాతం ఉధృతంగా తగ్గితే కోమాలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. బయటకు వెళ్లేవారు ఉప్పు బాగా వేసుకుని మజ్జిగ తీసుకోవాలి. అరటిపండు తప్పకుండా తీసుకోవాలి. బయట తిరిగే ప్రతి ఒక్కరూ రోజుకు నాలుగు నుంచి ఆరు లీటర్ల నీరు తాగుతూ ఉండాలి.

– డాక్టర్‌ కొటకొండ మనోహర్‌,

జనరల్‌ ఫిజిషియన్‌, రిమ్స్‌

జాగ్రత్తలు పాటించాలి

జిల్లాలో ఎండల తీవ్రత క్రమేపి పెరుగుతూ వస్తుంది. ప్రజ లు జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదయం 10 గంటలలోపు పనులు ముగించుకుని ఇళ్లకు చేరుకోవాలి. ఎండలకు ఎక్కువగా తిరిగేవాళ్లు తలపై టోపీ లేక కండువానో ధరించడంతోపాటు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. దీనికి తోడు మంచినీటిని క్రమం తప్పకుండా తీసుకోవాలి. వడదెబ్బకు గురైన వ్యక్తిని ముందుగా చల్లని ప్రదేశంలో ఉంచాలి. చల్లని తడి గుడ్డతో ఒళ్లంతా తుడవాలి. ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి వచ్చే వరకు చల్లని గాలి తగిలేలా చర్యలు తీసుకోవాలి. తరువాత ఉప్పు కలిపిన మజ్జిగ లేదా చిటికెడు ఉప్పు కలిపిన గ్లూకోజ్‌ ద్రావణం, ఓఆర్‌ఎస్‌ ద్రావణాన్ని తాపించాలి. తరువాత వైద్యుడిని సంప్రదించి ఆయన సూచనలు, సలహాల మేరకు వైద్య సేవలందించాలి.

– నాగరాజు, డీఎంఅండ్‌ హెచ్‌ఓ

రోజుకు ఆరు లీటర్లు నీరు తాగాలి  
1
1/1

రోజుకు ఆరు లీటర్లు నీరు తాగాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement