రేషన్‌ బియ్యం పంపిణీలో అవకతవకలు | - | Sakshi
Sakshi News home page

రేషన్‌ బియ్యం పంపిణీలో అవకతవకలు

Apr 25 2025 8:30 AM | Updated on Apr 25 2025 8:30 AM

రేషన్‌ బియ్యం పంపిణీలో అవకతవకలు

రేషన్‌ బియ్యం పంపిణీలో అవకతవకలు

పులివెందుల టౌన్‌ : గత ప్రభుత్వంలో ఇంటింటికీ రేషన్‌ బియ్యం సక్రమంగా పంపిణీ జరిగేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అధికారులు, కూటమి నాయకులు కుమ్మకై ్క రేషన్‌ బియ్యం పంపిణీ సక్రమంగా చేయడం లేదని, ఇందులో అవకతవకలు చోటు చేసుకుంటున్నాయని కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని శ్రీరంగనాథస్వామి ఆలయంలో నూతన కోనేరు ప్రారంభానికి వచ్చిన ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డితో ఎండీయూ ఆపరేటర్లు తమ గోడును వెల్లబోసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ వెంటనే కలెక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌కు ఫోన్‌ చేసి సమస్యను విన్నవించారు. గతంలో మాదిరి రేషన్‌ బియ్యం సక్రమంగా పంపిణీ జరగడంలేదని, ఎంతోమంది లబ్ధిదారులు కూడా ఈ విషయాన్ని తమ దృష్టికి తెచ్చారన్నారు. బియ్యం పంపిణీ ఒకట్రెండు రోజులు చేసి లేవని చెబుతున్నారని, కొందరికి రెండు, మూడు కేజీల బియ్యం తక్కువగా వస్తున్నాయన్నారు. ఇదంతా అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదన్నారు. ఎండీయూ ఆపరేటర్లను భయానికి గురి చేసి బియ్యం పంపిణీ వద్ద లేకుండా చేసి ఇష్టానుసారంగా రేషన్‌ పంపిణీ చేస్తున్నారని.. దీనిపై దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్‌కు ఫోన్‌లో వివరించారు. దీనికి కలెక్టర్‌ స్పందిస్తూ జేసీతో మాట్లాడి సక్రమంగా పంపిణీ జరిగేలా చూస్తామన్నారు. ఎంపీ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రాణితోపును అద్భుతంగా తీర్చిదిద్దామని.. దాన్ని ప్రస్తుత ప్రభుత్వం మెయింటెనెన్స్‌ చేయలేకపోతోందని, ఉలిమెల్ల లేక్‌ వ్యూను మెయింటెనెన్స్‌ చేయలేక శిల్పారామానికి ఇచ్చారన్నారు. అరటి రైతుల కోసం రూ.25కోట్లతో గత ప్రభుత్వంలో ఇంటిగ్రేటెడ్‌ కోల్డ్‌ స్టోరేజ్‌ను నిర్మించామని, ప్రస్తుత ప్రభుత్వం ఆ స్టోరేజ్‌ను వినియోగంలోకి కూడా తీసుకురాలేదన్నారు. అలాగే వైఎస్సార్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ను ఐదంతస్తుల భవనంతోపాటు క్రీడా మైదానాన్ని అత్యాధునికంగా నిర్మించామని, ఇప్పటికీ కూడా వినియోగంలోకి తీసుకరాలేదన్నారు. పులివెందులకే తలమానికమైన మెడికల్‌ కాలేజీను రూ.350కోట్లతో నిర్మిస్తే ప్రస్తుత ప్రభుత్వం మంజూరైన సీట్లను రద్దు చేసిందన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యాభాస్యం ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు.

ఉగ్రవాదుల దాడి అత్యంత బాధాకరం

పులివెందుల : కాశ్మీర్‌లో టూరిస్టులపై ఉగ్రదాడి అత్యంత హృదయ విదారకమైన సంఘటన అని కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి అన్నారు. గత కొన్నేళ్లుగా దేశంలో ప్రశాంత వాతావరణం ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో ఉగ్రదాడి జరగడం చాలా బాధాకరమన్నారు. పులివెందులలో గురువారం ఆయన మాట్లాడుతూ కాశ్మీర్‌ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందుతోందని, అక్కడ మినీ స్విట్జర్లాండ్‌ వాతావరణ పరిస్థితులు ఉంటాయన్నారు. అక్కడికి మన దేశ ప్రజలే కాకుండా, ఇతర దేశాల ప్రజలు కూడా వస్తారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉగ్రవాదులు దాడి చేయడం వలన టూరిజం వ్యవస్థ కూడా దెబ్బతింటోందన్నారు. ఆ సంఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు చూస్తుంటే మనసు కలచివేసిందన్నారు. ఉగ్రదాడిపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని, ఆ ఘటనకు పాల్పడిన ఉగ్రవాదులు ఏ గ్రూపునకు చెందిన వారైనా, వారిపై కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలన్నారు. ఉగ్రవాదులు చేసిన చర్యకు ప్రతి చర్యగా గట్టిగా సమాధానం ఇవ్వాలన్నారు.

కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడిన

ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement