
జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన ఎస్పీ అశోక్ కుమార్
కడప అర్బన్ : కడపలోని జిల్లా కోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా ఈనెల 20న బాధ్యతలను స్వీకరించిన డాక్టర్ సి. యామిని మంగళవారం జిల్లా కోర్టుకు విచ్చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఈ.జీ అశోక్కుమార్ ఆమెను మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చం అందచేసి శుభాకాంక్షలు తెలిపారు. న్యాయ వ్యవస్థ, పోలీస్ శాఖ సమన్వయంతో కృషి చేసి ప్రజలకు న్యాయం అందుబాటులో ఉండేలా చూసేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. కడప జిల్లా జ్యుడీషియల్ ఎంప్లాయాస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పి.శశికాంత్రెడ్డి, సభ్యులు కూడా జిల్లా ప్రధాన న్యాయమూర్తిని మర్యాద పూర్వకంగా కలిశారు.