
భార్యాభర్తల సమస్యను రాజకీయం చేయొద్దు
వేంపల్లె : భార్యాభర్తల సమస్యను కొందరు వ్యక్తులు రాజకీయం చేయడంతో కుటుంబాలు నాశనమవుతున్నాయని, ఇది మంచిది కాదని పఠాన్ మున్వర్, ఖాసీం వలీలు పేర్కొన్నారు. మంగళవారం నందిపల్లెలో వారు విలేకరులతో మాట్లాడుతూ గత రెండేళ్ల క్రితం వీరపునాయునిపల్లె మండలంలోని నేలతిమ్మయ్యగారిపల్లెకు చెందిన పెద్ద బాదుల్లా కుమార్తె షీరిన్ భానును వివాహం చేసుకున్నట్లు చెప్పారు. అయితే వివాహమైనప్పటి నుంచి భార్యాభర్తల మధ్య విభేదాలు ఎప్పుడు లేవని, భార్యను ఎప్పుడు హింసించలేదని వారు తెలిపారు. చిన్న మాట విషయంలో తన భార్య అయిన షీరిన్ పుట్టింటికి వెళ్లిందన్నారు. పెద్ద మనుషులను తీసుకొని వచ్చి సంజాయిషీ చెప్పకపోగా, చిన్నమామ చిన్న బాదుల్లా అనే వ్యక్తి ఘర్షణ జరగడానికి మూల కారణమన్నారు. గత ఆదివారం రాత్రి చిన్న బాదుల్లా అనే వ్యక్తి రాజకీయం చేసి వేంపల్లెలోని బిడ్డాలమిట్ట ప్రాంతంలో ఉన్న అబ్దుల్తోపాటు 40 మందిని కత్తులు, రాడ్లతో పిలుచుకొని వచ్చి తమ కుటుంబంపై దాడి చేశారని తెలిపారు. గ్రామస్తులందరూ ఏకమై అడ్డుకోవడంతోనే తాము ప్రాణాలతో బయటపడినట్లు చెప్పారు. కుటుంబ సమస్యలను రాజకీయాలకు అంటగట్టడం తగదన్నారు.