
ఉత్సాహంగా బండలాగుడు పోటీలు
ప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక రామేశ్వరంలోని శ్రీ ముక్తిరామలింగేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం నిర్వహించిన బండలాగుడు పోటీలు ఉత్సాహంగా సాగాయి. ఈ పోటీల్లో ప్రథమ బహుమతి రమేష్ బాబు(తాడిపత్రి), ద్వార్శల గురివిరెడ్డి (ప్రొద్దుటూరు) ఎద్దులు 1949.06 అడుగులు లాగి రూ.1.00,116, ద్వితీయ బహుమతి మార్తల చంద్ర ఓబుళరెడ్డి (చౌటపల్లె) ఎద్దులు 1806.04 అడుగులు లాగి రూ.75,116, తృతీయ బహుమతి రామసుబ్బారెడ్డి (హుస్సేనాపురం), చిన్న నాగన్న (పీఆర్పల్లె, నంద్యాల జిల్లా) 1640.07 అడుగులు లాగి రూ.50,116 నగదు అందుకున్నారు. గెలుపొందిన ఎడ్ల యజమానులకు నగదు బహుమతులు అందించి సత్కరించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రాజారెడ్డి, ఈఓ శ్రీధర్, దాతలు, భక్తులు పాల్గొన్నారు.