ప్రాజెక్టు కమిటీ హామీ మేరకే కేసీ ఆయకట్టు రైతులు పంటలు సాగు చేశారు. ఈ పంటలు కాపాడటం కోసం ఏప్రిల్ 15 వరకు నీరివ్వాల్సిన అవసరం ఉంది. కుందూలో నీటి ప్రవాహం ఉంటేనే తాము ఇవ్వగలమంటూ ప్రభుత్వ అధికారులు చెప్పడం తగదు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద ముందస్తు ప్రణాళిక లేకపోవడమే ఈ దుస్థితికి కారణం. ముచ్చుమర్రి లిఫ్ట్ లేదా వెలుగోడు నుంచి నీటి విడుదల చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.
– అచ్చుకట్ల కరీముల్లా,
జెడ్పీ కో ఆప్షన్ సభ్యుడు, ఖాజీపేట
మైలవరం నుంచి నీరివ్వాలి
కడప–చెన్నూరు ప్రాంత కేసీ కెనాల్ ఆయకట్టులో సాగు చేసిన పంటలను రక్షించేందుకు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మైలవరం రిజర్వాయర్లో అవసరమైన నీటి లభ్యత ఉంది. అక్కడి నుంచి పెన్నా ద్వారా నీటిని ఆదినిమ్మాయపల్లె ఆనకట్ట వరకు తీసుకొచ్చి కేసీ ఆయకట్టుకు ఇవ్వాలి. ఈ విషయాన్ని తాము కేసీ కెనాల్ అధికారులను కోరగా, మైలవరం తమ పరిధిలో లేదని, కడప చీఫ్ ఇంజనీరు పరిధిలో వస్తుందంటున్నారు. ఈ విషయంలో కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకుని కడప చీఫ్ ఇంజనీరుతో మాట్లాడి మైలవరం నుంచి నీరు విడుదల చేయాలి. – ఎన్.రవిశంకర్రెడ్డి,
కార్యదర్శి, రాయలసీమ
కమ్యూనిస్టు పార్టీ, కడప
ఏప్రిల్ 15 వరకు నీరివ్వాలి