సాంకేతికతపై అవగాహన తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

సాంకేతికతపై అవగాహన తప్పనిసరి

Mar 30 2023 1:12 AM | Updated on Mar 30 2023 1:12 AM

మాట్లాడుతున్న ప్లేస్‌మెంట్‌ సెల్‌ కో–ఆర్డినేటర్‌ మురళి  
 - Sakshi

మాట్లాడుతున్న ప్లేస్‌మెంట్‌ సెల్‌ కో–ఆర్డినేటర్‌ మురళి

పులివెందుల రూరల్‌ : పట్టణంలోని జేఎన్‌టీయూ కళాశాలలో బుధవారం ప్లేస్‌మెంట్‌ సెల్‌ కో–ఆర్డినేటర్‌ మురళి ఆధ్వర్యంలో శ్రీఇండస్ట్రియల్‌ ఎక్స్‌పోజర్‌ ఆన్‌ బ్లాక్‌ టెక్నాలజీశ్రీఅనే కార్యక్రమంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డ్రోన్‌ వేద ఇండియా ప్రైవేట్‌ ఇండియా లిమిటెడ్‌ వ్యవస్థాపకుడు అరుణ్‌కుమార్‌రెడ్డి, టాటా ఇండియా అంబాసిడర్‌ కె.రజత్‌కుమార్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా అరుణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ భవిష్యత్‌లో బ్లాక్‌ చైన్‌ ట్రెండింగ్‌ టెక్నాలజీ అన్ని రంగాలలో ఉపయోగపడుతుందన్నారు. సాంకేతికతపై అవగాహన తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు. రజత్‌కుమార్‌ బ్లాక్‌ చైన్‌ అంటే ఏమిటి, అది అన్ని రంగాల్లో ఎలా ఉపయోగిస్తారనే విషయాన్ని విద్యార్థులకు తెలిపారు. డాక్టర్‌ మురళి మాట్లాడుతూ విద్యార్థులకు అన్ని టెక్నాలజీల గురించి తెలియజేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమమన్నారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement