సీపీఎం మహాధర్నాకు తరలిరావాలి | - | Sakshi
Sakshi News home page

సీపీఎం మహాధర్నాకు తరలిరావాలి

Jul 12 2026 6:53 PM | Updated on Jul 12 2026 6:53 PM

భువనగిరిటౌన్‌ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలనే డిమాండ్‌తో ఈ నెల 15న హైదరాబాద్‌ ఇందిరాపార్కు వద్ద సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టనున్న మహాధర్నాకు నిరుద్యోగ యువత తరలి వచ్చి జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్‌ పిలుపునిచ్చారు. భువనగిరి జిల్లా కేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో శనివారం ధర్నాకు సంబంధించిన పోస్టర్‌ ఆవిష్కరించి మాట్లాడారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తామన్న మోదీ హామీ 12 ఏళ్లయినా నెరవేరలేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలంటూ యూత్‌ డిక్లరేషన్‌ ఇచ్చి నిరుద్యోగులను వంచించిందని విమర్శించారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు కొండమడుగు నరసింహ, బట్టుపల్లి అనురాధ, మాటూరి బాలరాజు, దయ్యాల నరసింహ, పల్లెర్ల అంజయ్య, ఈర్లపల్లి ముత్యాలు, అన్నంపట్ల కృష్ణ, ఎదునూరి మల్లేశం పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement