
బ్యాగేజ్ స్కానర్ ప్రారంభం
యాదగిరిగుట్ట ఆలయంలోని ధర్మ దర్శనం క్యూలైన్లో ఎక్స్రే బ్యాగేజ్ ఇన్స్పెక్షన్ స్కానర్ను ఎస్పీఎఫ్ ఇన్స్పెక్టర్ శేషగిరిరావు, బీటీ టీం ఆర్ఎస్ఐ శ్రీనివాస్ మంగళవారం ప్రారంభించారు. ఇటీవల జమ్మూకశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసిన నేపథ్యంలో యాదగిరిగుట్టలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ స్కానర్ ద్వారా భక్తుల బ్యాగులు, ఇతర వస్తువులను స్కాన్ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. మరో రెండు స్కానర్లను సైతం త్వరలోనే వీఐపీ ప్రొటోకాల్ కార్యాలయం వద్ద లిఫ్టులో, ఆలయ తూర్పు రాజగోపురం వద్ద ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.