ప్రేమ పేరుతో మోసం.. యువతి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ప్రేమ పేరుతో మోసం.. యువతి ఆత్మహత్య

Apr 15 2025 1:40 AM | Updated on Apr 15 2025 1:40 AM

ప్రేమ పేరుతో మోసం..  యువతి ఆత్మహత్య

ప్రేమ పేరుతో మోసం.. యువతి ఆత్మహత్య

న్యాయం చేయాలని కోదాడ– జడ్చర్ల హైవేపై కుటుంబ సభ్యుల రాస్తారోకో

నిడమనూరు: నిడమనూరు మండలం బొక్కమంతలపహాడ్‌ గ్రామానికి చెందిన యువతిని అదే గ్రామానికి చెందిన యువకుడు ప్రేమ పేరుతో మోసం చేయడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. యువతి కుటుంబానికి న్యాయం చేయాలని ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు సోమవారం రాత్రి కోదాడ–జడ్చర్ల రహదారిపై బొక్కమంతలపహాడ్‌ గ్రామంలో రాస్తారోకో నిర్వహించారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. బొక్కమంతలపహాడ్‌ గ్రామానికి చెందిన ధర్మారపు మల్లేశ్వరి హైదరాబాద్‌లోనే సరూర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధి హాస్టల్‌లో ఉంటూ నిమ్స్‌ ఆస్పత్రిలో స్టాఫ్‌ నర్సుగా పనిచేస్తోంది. అదే గ్రామానికి కుక్కల జాన్‌రెడ్డి కూడా హైదరాబాద్‌లోనే రీహాబిలిటేషన్‌ సెంటర్‌లో పనిచేస్తున్నాడు. ఒకే గ్రామం కావడంతో వీరిద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. జాన్‌రెడ్డి ఇటీవల మరో యువతిని వివాహం చేసుకోవడంతో అది భరించలేక మల్లేశ్వరి ఆదివారం హాస్టల్‌లో విషపూరితమైన ఇంజెక్షన్‌ వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్‌ సిబ్బంది గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. పోస్టుమార్టం పూర్తయిన తర్వాత సోమవారం సాయంత్రం కుటుంబ సభ్యులు, బంధువులు మల్లేశ్వరి మృతదేహాన్ని బొక్కమంతలపహాడ్‌ గ్రామానికి తమకు న్యాయం చేయాలని జడ్చర్ల– కోదాడ జాతీయ రహదారిపై రాత్రి వరకు రాస్తారోకో చేపట్టారు.

చీకోటి ప్రవీణ్‌పై కేసు నమోదు

నల్లగొండ: హనుమాన్‌ జయంతి సందర్భంగా నల్ల గొండ పట్టణంలో నిర్వహించిన ర్యాలీలో బీజేపీ నాయకుడు చీకోటి ప్రవీణ్‌ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఆయనపై నల్లగొండ వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఓవైసీ బ్రదర్స్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కారణంతో సుమోటోగా కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement