మాజీ మంత్రి కారుమూరి అరెస్ట్ ప్రజాస్వామికం. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. బలమైన సామాజికవర్గ ప్రజాప్రతినిధులు, నేతలను టార్గెట్ చేస్తున్నారు. అక్రమ కేసులు, దాడులు, దౌర్జన్యాలు, వేధింపులు ప్రజాస్వామ్యంలో సరికాదు. అధికారం శాశ్వతం కాదన్న విషయాన్ని కూటమి పెద్దలు గ్రహించాలి.
– కొఠారు అబ్బయ్యచౌదరి,
దెందులూరు మాజీ ఎమ్మెల్యే
అక్రమ కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును అరెస్టు చేయడం అన్యాయం. బీసీ నాయకుడిని తప్పుడు కేసులో ఇరికించారు. టీడీపీ ప్రభుత్వం పాలనను గాలికొదిలేసి, అక్రమ కేసులు పెట్టడమే పనిగా పెట్టుకుంది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టుగా కూడా లేదు.
– మేకా వెంకట ప్రతాప్ అప్పారావు,
నూజివీడు మాజీ ఎమ్మెల్యే


